కందుకూరు : పార్టీ బలోపేతానికి కృషి చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. సోమవారం మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్రెడ్డి ఆమె నివాసంలో మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు. పార్టీని ముందుకు తీసుకువెళ్లడానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని పేర్కొన్నారు. ప్రతి పక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని సూచించారు.
అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదని వివరించారు. పార్టీ సంస్థగత ఎన్నికల్లో భాగంగా పార్టీ కోసం పని చేస్తున్న వారిని గుర్తించి సముచిత స్థానం కల్పిస్తానని చెప్పారు. గ్రామ గ్రామాన పార్టీని విస్తరించడానికి కృషి చేయాలని కోరారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి ప్రతి పక్ష పార్టీల నాయకులు జీర్ణించుకోలేక నిరాదారమైన ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు.
రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి తప్పా ఇతర పార్టీలకు చోటులేదన్నారు. కార్యక్రమంలో యువజన విభాగం వర్కింగ్ ప్రసిడెంట్ తాళ్ల కార్తీక్, సోషల్ మీడియ కన్వీనరు బొక్క దీక్షిత్రెడ్డి, నాయకులు కసోజు ప్రశాంత్చారి, లు పాల్గొన్నారు.