పెద్దఅంబర్పేట : పెద్దఅంబర్పేట మున్సిపాటి అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మున్సిపాలిటి పరిధిలోని సర్వే నం. 123, 244లో నూతన మున్సిపల్ భవన నిర్మాణానికి మున్సిపల్ చైర్పర్సన్ చెవుల స్వప్న, కమిషనర్ ఖమర్అహ్మద్, కౌన్సిర్లతో కలిసి మంగళవారం స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా సర్వేనం 123, 244 లలో ఉన్న స్థల వివరాలను ఆర్ఐ కవితను అడిగి తెలుసుకున్నారు.
సర్వే నంబర్ల స్కెచ్ ప్లాన్లు తయారు చేసి మున్సిపల్ డిప్యూటి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, డిప్యూటీ తాసీల్దార్కు సమర్పించాలని ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని మున్సిపాలిటీలను దశల వారీగా అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చడమే లక్ష్యమన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో మరిన్ని నిధులు తీసుకొచ్చి మున్సిపాలిటీలను ఆదర్శ మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దుతానన్నారు.
నియోజకవర్గం అభివృద్ధిలో ప్రతీ ఒక్కరూ పార్టీలకు అతీతంగా కలిసి రావాలన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కృష్ణారెడ్డి, అర్చన దామోదర్, రోహిణి బ్రహ్మానందరెడ్డి, విద్యావిజయేందర్రెడ్డి, కోటేశ్వర్రావు, హరిశంకర్, అనుపమా, పరుశురాం, శ్రీనివాస్గౌడ్, మురళీధర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పూజారి చక్రవర్తిగౌడ్, సర్పంచ్ చెరుకు కిరణ్కుమార్గౌడ్, నాయకులు ప్రభాకర్రెడ్డి, చిరంజీవి ఉన్నారు.