కడ్తాల్ : వాహనదారులు విధిగా రోడ్డు నిబంధనలను పాటించాలని షాద్నగర్ ట్రాఫిక్ ఎస్సై రఘుకుమార్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని టోల్ప్లాజా వద్ద వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన 22మందిపై కేసులు నమోదు చేసి, వాహనాలను పోలీస్స్టేషన్కు తరలించిన్నట్లు ఎస్సై తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్సై రఘుకుమార్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయని తెలిపారు. మద్యం తాగి నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.