కొత్తూరు రూరల్ : ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న కొవిడ్ టీకాను ప్రతి ఒక్కరూ వేసుకుని కరోనా వ్యాధిని తరిమి కొట్టాలని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. గురువారం కొత్తూరు మండల పరిధిలోని మక్తగూడ ఆవరణలో సర్పంచ్ కాట్న రాజు ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ ఆరోగ్యమే మహభాగ్యమని ఆరోగ్యంపై ప్రజలు అశ్రద్ధ చూపొద్దన్నారు. కరోనా ముప్పు తగ్గేంత వరకు ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని, ఎక్కడకి వెళ్లినా మాస్కు తప్పకుండా ధరించాలన్నారు.
బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ మధుసూదన్రెడ్డి, ఎంపీడీవో జ్యోతి, మండల వైద్యాధికారి కవిత, కొత్తూరు మున్సిపల్ వైస్ చైర్మన్ రవీందర్, కౌన్సిలర్ కోస్గీ శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీలు దేవేందర్యాదవ్, మోడి దర్శన్, టీఆర్ఎస్ ఎస్టీ సెల్ మండలాధ్యక్షుడు గోపాల్నాయక్, గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ రాములు గౌడ్, టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు దయ్యాల పాండు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.