దౌల్తాబాద్ : జాతీయ స్థాయిలో ఇన్స్స్పైర్ పోటీల్లో మండలానికి చెందిన విద్యార్థి 3వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 2019-2020 సంవత్సరానికి గాను ఇన్స్స్పైర్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి మొత్తం 33మంది విద్యార్థులు పాల్గొనగా, దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి మొత్తం 1000 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. జాతీయ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 4న ప్రారంభమై 8వరకు ఆన్లైన్లో నిర్వహించారు. ఈ పోటీల్లో దౌల్తాబాద్ మండలం గోఖఫస్లవాద్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న దాసరి ఆశోక్ ప్రదర్శించిన ప్రాజెక్టు సీలింగ్ఫ్యాన్ లిఫ్టింగ్ టూల్ అత్యుత్తమ ప్రదర్శనగా అందరి మన్ననలు పొందింది. దీంతో జాతీయ స్థాయిలో మూడో స్థానం కైవసం చేసుకోవడంతో ఉపాధ్యాయులు, తల్లీదండ్రులు, ప్రజాప్రతినిధులు విద్యార్థి ఆశోక్ను అభినందించారు.