అబ్దుల్లాపూర్మెట్ : మండలంలో కబ్జాకు గురైన చెరువు, కుంటలను రక్షించాలని తెలంగాణ మత్య్సకారులు, కార్మిక సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి నర్సింహా డిమాండ్ చేశారు. మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం తాసీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మండల పరిధిలోని చెరువులు, కుంటలను షాటిలైట్ ద్వారా రీ సర్వే చేసి ఎఫ్టిఎల్ హద్దు రాళ్లను ఏర్పాటు చేయలన్నారు.
చెరువు, కుంటలను కబ్జా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. గత సంవత్సరంలో కురిసిన వర్షాలకు కొన్నిచోట్ల చెరువు కట్ట తెగిపోవడంతో చేతికొచ్చిన చేపలు కొట్టుకుపోయాయన్నారు. దీంతో మత్స్యకారులు అప్పుల్లో చిక్కుకకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రూ. 10 లక్షల ప్రత్యేక బడ్జెట్ కెటాయించి యుద్ధప్రాతిపదకన చెరువు, కుంటలకు మరమ్మతులు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షుడు పొన్నల శంకర్, కార్యదర్శి కావలి రాములు, గ్రామాల సొసైటీల అధ్యక్షులు శ్రీనివాస్, శ్రీరాములు, నర్సింహ, కృష్ణ, సూరయ్య, యాదయ్య, భిక్షపతి, లింగం, వెంకటేష్, ఎడ్ల మహేందర్, మహేష్, శ్రీనివాస్ ఉన్నారు.