మైలార్దేవ్పల్లి: కాటేదాన్ వెంకటేశ్వర దేవాలయ అభివృద్ధికి భక్తులు తమ వంతుగా ధన ,వస్తు రూపేణా కానుకలు సమర్పిస్తున్నారని ఆలయ నిర్వాహకులు తెలిపారు. వెంకన్న గుట్టపై వెలసిన శ్రీపద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి గరుడాళ్వార్ వాహనాన్ని మైలార్దేవ్పల్లి డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు టి ప్రేమ్గౌడ్ ,తన స్నేహితుడు వెంకట్రెడ్డిలు కైంకర్యం చేశారు. ఆలయంలో ప్రతి నెల పౌర్ణమి రోజున మాడ వీధులలో గరుడాళ్వార్కు ఊరేగింపు సేవ నిర్వహిస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు.