అబ్దుల్లాపూర్మెట్ : మండలంలోని ఇనాంగూడ భైరంఖాన్ చెరువులో గణపతి నిమజ్జన ఏర్పాట్లను ఎల్బీనగర్ డీసీపీ సన్ప్రీత్సింగ్, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డితో కలిసి బుధవారం పరిశీలించారు. చెరువులో గణేష్ నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. విద్యుత్ దీపాలు, రోడ్లు, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా వసతులను కల్పించాలన్నారు. ఏర్పాట్లపై సీఐ స్వామి, సర్పంచ్ యశోదను అడిగి తెలుసుకున్నారు. అధికారులతో ఎస్ఐ వీరభద్రం ఉన్నారు.