ఇబ్రహీంపట్నంరూరల్ : దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకంపై రాసిన పాటకు అరుదైన గౌరవం దక్కింది. ఈ పాటను ఇబ్రహీంపట్నం మండలం తులేకలాన్కు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, కళాకారుడు బోడ చంద్రప్రకాశ్ పాడి సీఎం కేసీఆర్ మనసును గెలిచాడు.
రాష్ట్రవ్యాప్తంగా దళిబంధు పథకంపై పాడిన పాటల్లో చంద్రప్రకాశ్ పాటను ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటిప్రాధాన్యత కింద ఎంపికచేయడం పట్ల ప్రకాశ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రకాశ్ మాట్లాడుతూ ఎంతో కష్టపడి పాడిన పాటకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక గుర్తింపునివ్వడం ఆనందంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పాటలు పాడు ప్రజలకు తెలియజేసేందుకు కృషి చేస్తానని ప్రకాశ్ తెలిపారు.