కొడంగల్ : గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన కొడంగల్ పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పీఎస్ఐ (ప్రోబిషనరి ఎస్ఐ) శైలజ కథనం ప్రకారం.. మండలంలోని నీటూరు గ్రామానికి చెందిన ర్యాలపాట ఉషాప్ప(32) హైదరాబాద్ నుంచి బుధవారం బైకుపై స్వగ్రామానికి బయలుదేరాడు. చిన్ననందిగామ స్టేజీ వద్ద ఉషాప్ప బైకును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.
బ్లూకోట్స్ పోలీసులు గుర్తించి మృతదేహాన్ని దవాఖానకు తరలించారు. బ్లూకోట్స్ పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.