షాద్నగర్రూరల్ : జిల్లా స్థాయిలో క్రికేట్ ఆడేందుకు టీసీఏ నూతన క్రికెట్ జట్టును షాద్నగర్ ఎస్ఎల్వి క్రికెట్ అకాడమీలో ఎంపిక చేశారు. ఇందులో భాగంగానే అండర్19, 23 విభాగంలో ఆడెందుకు అర్హులైన టీంను ఎంపిక చేసినట్లు ఉమ్మడి జిల్లా ఇన్చార్జి ప్రేమ్కుమార్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో క్రీడాకారులు ఎంతో మంది ఉన్నరని వారందరూ క్రీడా రంగంలో ప్రతిభ కనబర్చలన్నారు. క్రికెట్పై ఆసక్తి ఉన్నవారు తమ ప్రతిభను చాటుతూ జిల్లా స్థాయిలో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో క్రీడాకారులు కిరణ్, డెవిడ్, మథిన్ పాల్గొన్నారు.