శంకర్పల్లి : పాదయాత్ర చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చేవేళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య నిప్పులు చెరిగారు. గురువారం శంకర్పల్లిలో టీఆర్ఎస్ జెండా ఎగురవేసిన అనంతరం స్థానిక గెస్ట్హౌజ్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బండి సంజయ్ అనవసరంగా సీఎం కేసీఆర్పై నోటికి వచ్చినట్లు మాట్లాడడం తగదని హితవు పలికారు. రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు దొరకక కావాలనే ప్రజలను రెచ్చగొట్టేందుకు పాద యాత్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. యాత్ర మంచికా లేదా మత విద్వేశాలు రెచ్చగొట్టడానికా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్నది ఏమీ లేదన్నారు. కోట్ల రూపాయలు పన్నుల రూపంలో రాష్ట్రం కేంద్రానికి అందిస్తున్నదని తెలిపారు. 75 సంవత్సరాల కాలంలో దేశంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టని సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్ చేపట్టి పేద ప్రజలను ఆదుకుంటున్నారని గుర్తు చేశారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టి పేదింటి ఆడపడుచులను కేసీఆర్ ఆదుకుంటున్నారని చెప్పారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదని విమర్శించారు.
సీఎం కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా, దళితబంధు పథకాలను ప్రవేశపెట్టి రైతులను ఆదుకుంటున్నారని తెలిపారు. ఇటీవల వంటగ్యాస్ ధరలు పెంచి పాదయాత్ర చేపట్టడం సిగ్గు చేటన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్రెడ్డి, జడ్పీటీసీ గోవిందమ్మ, చైర్పర్సన్ విజయలక్ష్మి, వైస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, పీఏసీఎస్, ఏఎంసీ చైర్మన్లు శిశిధర్రెడ్డి, బుచ్చిరెడ్డి, మండల టీఆర్ఎస్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గోపాల్, వాసుదేవ్కన్నా, శంకర్పల్లి మాజీ ఉప సర్పంచ్ ప్రవీణ్కుమార్, నాయకులు రాంరెడ్డి, హనుమంత్రెడ్డి, సుధాకర్రెడ్డి, పార్శిబాలకృష్ణ, గోవర్ధన్రెడ్డి, గోపాల్రెడ్డి, విజయ్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.