కాచిగూడ,మే 2: కొన్నేండ్ల క్రితం అధ్వానంగా ఉన్న కాచిగూడ డివిజన్లోని పలు బస్లీ రోడ్లు ప్రస్తుతం అద్దంలా కనిపిస్తున్నాయి. ప్రయాణం సాగించడానికి ఇబ్బందులు తలెత్తే ఆ రోడ్ల పై రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి. గతుకులమయంగా మారిన రహదారులు అందంగా తయారయ్యాయి. ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ప్రత్యేకంగా జీహెచ్ఎంసీ ద్వారా నిధులు మంజూరు చేయించి ఈ రోడ్లును వేయించారు. వివరాల్లోకెళితే.. కాచిగూడ డివిజన్లోని ఎస్సీ హాస్టల్ లేన్ రోడ్డు గతంలో నడవడానికి కూడా ఇబ్బందిగా ఉండేది. గుంతలుగా మారి కంకరతేలి రాకపోకలకు ఇబ్బంది కలిగేది. స్థానిక ప్రజలు రోడ్డును బాగుచేయాలని పలుమార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోలేదు.
ఈ విషయం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే సంబంధిత అధికారులను పిలిచి తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు. ప్రతిపాదనలకు అనుగుణంగా రూ.37లక్షల నిధులు జీహెచ్ఎంసీ ద్వారా మంజూరు చేయించారు. దీంతో డివిజన్లోని రోడ్లును అద్దంలాగా నిర్మింపజేశారు. అదే విధంగా బర్కత్పురలో కూడా రోడ్డు అధ్వానంగా మారి రాకపోకలకు అనేక ఇబ్బందులు ఉండేది. అక్కడ కూడా జీహెచ్ఎంసీ ద్వారా నిధులు మంజూరు చేయించి కొత్తగా రోడ్డును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ రోడ్లు అద్దంలాగా తయారయ్యాయి. దీంతో స్థానికులు, వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల సహకారంతో నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నాం. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా కాచిగూడ డివిజన్లోని రోడ్లాన్ని అధ్వానంగా తయారయ్యాయి. రోడ్లు బాగాలేవని స్థానికులు ఫిర్యాదు చేయడంతో రూ.37లక్షలు వెచ్చించి డివిజన్లోని రోడ్లంన్నింటినీ అద్దంలా తీర్చిదిద్దాం. -కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్యే