కొత్తూరు : మండల పరిధిలోని చేగూర్లో ఏర్పాటు చేస్తున్న బృహత్ పల్లెప్రకృతి వనాన్ని కలెక్టర్ అమయకుమార్ గురువారం పరిశీలించారు. ఈ వనాన్ని త్వరలో ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవానికి చీప్ సెక్రెటరీ సోమేశ్కుమార్ రానున్నారని సమాచారం రావడంతో పనులు ఎలా జరుగుతున్నాయని కలెక్టర్ అక్కడి వారిని అడిగి తెలుసుకున్నారు. ప్రతి మండలంలో ఒక బృహత్ పల్లెప్రకృతి వనాన్ని ఏర్పాటు చేస్తున్నరని తెలిపారు.
అందులో భాగంగా 5 ఎకరాల స్థలంలో చేగూర్లో ఈ పల్లెప్రకృతి వనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రతీక్జైన్, సర్పంచ్ మావిళ్ల సంతోష విట్టల్, సింగిల్విండో మాజీ చైర్మన్ మావిళ్ల విటల్, ఎంపీడీవో బాల్రెడ్డి, ఎంపీవో గిరిరాజ్, ఎన్ఆర్జీఎస్ సిబ్బంది నర్సింహులు, బబ్లూ, జంగయ్య, నరేందర్ పాల్గొన్నారు.