రంగారెడ్డి : వ్యాక్సినేషన్ ప్రక్రియ జీహెచ్ఎంసీ పరిధిలో ఉధృతంగా కొనసాగుతున్నది. వంద శాతం టీకాలు వేయించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది.
గురువారం జీహెచ్ఎంసీ పరిధిలోని ఎల్బీనగర్ సర్కిల్, లింగోజి గూడ డివిజన్, సరూర్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా జానకి ఎన్ క్లేవ్లోని కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించి పలు సూచనలు చేశారు. విధుల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట అధికారులు తదితరులు ఉన్నారు.