కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్య భద్రతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని ఏక్వాయి పల్లి గ్రామానికి చెందిన శ్రీజకి రూ. 3లక్షలు (ఎల్ఓసీ), వెల్దండ మండలానికి చెందిన అంబ్రు నాయక్కి రూ. 26 వేలు, దావునాయక్కి రూ. 32 వేలు, జగత్రెడ్డికి రూ. 26 వేలు ముఖ్య మంత్రి సహాయనిధి చెక్కులు మంజూరయ్యాయి. గురువారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంజూరైన చెక్కులను ఎమ్మెల్సీ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పథకం పేదలకందరికీ వరంలా మారిందని తెలిపారు. కార్యక్రమంలో సురేందర్రెడ్డి, కొండల్రెడ్డి, సుమన్గౌడ్, వెంకట్రెడ్డి పాల్గొన్నారు.