కడ్తాల్ : పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని మైసిగండి గ్రామానికి చెందిన గోపికి రూ. 60వేలు, తలకొండపల్లి మండలం గట్టిప్పలపల్లి గ్రామానికి చెందిన రేణురెడ్డికి రూ. లక్ష ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరయ్యాయి. గురువారం హైదరాబాద్లోని తన కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పథకంతో పేదలందరికీ వరంలా మారిందని, నిరుపేదలకు కార్పొరేట్ దవాఖానలో అత్యుత్తమ వైద్యం అందుతున్నదని తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శేఖర్గౌడ్, సురేందర్రెడ్డి పాల్గొన్నారు.