యాచారం : సీఎం రిలీఫ్ ఫండ్ పథకం పేదలకు వరంగా మారిందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. తమ్మలోనిగూడకు చెందిన దొండ లక్ష్మారెడ్డి అనే వ్యక్తి అనారోగ్యంతో దవాఖానలో చేరాడు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అతనికి సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ద్వారా మంజూరైన రూ. 60,000ల చెక్కును మంగళవారం అందజేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ఎంతో మంది పేదలకు అండగా నిలుస్తుందన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టి ఆదుకుంటుందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కాలె మల్లేశ్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.