దౌల్తాబాద్ : కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దౌల్తాబాద్ మండలం నంద్యానాయక్ తండా గ్రామానికి చెందిన బాబునాయక్కు రూ. 29వేల ఎల్ఓసిని గురువారం ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తన నివాసంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదాలకు దవాఖానల ఖర్చుల నిమిత్తం ఎంతో ఉపయోగపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నంద్యానాయక్ తండా నాయకులు, మంజులాల్నాయక్, ఎల్జీ తండా వాసులు పాండునాయక్ ఉన్నారు.