షాద్నగర్ : సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు ఓ వరంలాంటిదని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శుక్రవారం తన నివాసంలో ఆఫీసర్స్ కాలనీకి చెందిన పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం అందించే ఆర్థిక సహాయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇందులో భాగంగానే చెట్ల చిన్ని కృష్ణకు రూ. 2లక్షలు, రాఘవేంద్రకాలనీకి చెందిన చిప్స్ కృష్ణకు రూ. లక్ష చెక్కులను అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు చెట్ల నర్సింలు, గుడ్డుయాదవ్, భూపాల్రెడ్డి, రాజవర్ధన్రెడ్డి, నందిగామ జంగయ్య, జుట్టు రాజు, విశ్వనాథ్, అర్జునయ్య, అమృత పాల్గొన్నారు.