కడ్తాల్ : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని ఏక్వాయిపల్లి గ్రామానికి చెందిన సంధ్యకి రూ. 28వేలు, ఆమనగల్లు మండలం మంగళ్పల్లి గ్రామానికి చెందిన సురేందర్రెడ్డికి రూ. 54వేలు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు మంజూరయ్యాయి.
మంగళవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పథకం పేదలకందరికీ వరంలా మారిందని, ఈ పథకం ఎంతో మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపిదని పేర్కొన్నారు. సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పథకాలను అమలు చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో నాయకులు రాములుయాదవ్, యాదయ్యగౌడ్, పాండు పాల్గొన్నారు.