శంకర్పల్లి : ముఖ్య మంత్రి చంద్రశేఖర్రావు యువతకు ప్రాధాన్యత ఇస్తూ, వారి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని చేవేళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శనివారం మున్సిపల్ పరిధిలోని సింగాపురానికి చెందిన బీజేపీ నాయకుడు భరత్రెడ్డి తన 30మంది అనుచరులతో ఎమ్మెల్యే కాలె యాదయ్య సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాల ప్రజలను సీఎం కేసీఆర్ ఆదుకుంటున్నారని తెలిపారు.
ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సాత విజయలక్ష్మి, ఎంపీపీ గోవర్ధన్రెడ్డి, జడ్పీటీసీ గోవిందమ్మ, వైస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ బుచ్చిరెడ్డి, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు గోపాల్, ప్రధాన కార్యదర్శి వాసుదేవ్కన్నా, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు, మిర్జాగూడ సర్పంచ్ రవీందర్గౌడ్, కౌన్సిలర్లు చంద్రమౌళి, మాజీ ఎంపీపీ నర్సింహులు, మాజీ ఉప సర్పంచ్ సాత ప్రవీణ్కుమార్, నాయకులు చేకుర్త గోపాల్రెడ్డి, పాండురంగారెడ్డి, ఒగ్గు అంజయ్య పాల్గొన్నారు.