బడంగ్పేట: సీఎం సహాయనిధి పేదలకు వరం లాంటిదని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 9వ డివిజన్ నందిహిల్స్లో నివాసముం టున్న మట్ట మల్లమ్మ అనే మహిళ అనారోగ్యానికి గురైంది.
ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స తీసుకోగా అధిక ఖర్చు కావడంతో డివిజన్ ఇన్చార్జి రామిడి నర్సిరెడ్డి సహకారంతో సీఎం సహాయనిధికి ధరఖాస్తు చేసుకున్నారు. వచ్చిన రూ. 45వేల చెక్ను మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం బాధిత కుటంబసభ్యునికి అందజేశారు.