షాద్నగర్టౌన్ : తల్లిపాలతోనే పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని మున్సిపాలిటీలోని 22వ వార్డు కౌన్సిలర్ సరితయాదగిరియాదవ్ అన్నారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా శనివారం వార్డులోని అంగన్వాడీ కేంద్రంలో గర్భణులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పుట్టిన పసిపాపలకు 6నెలల పాటు తప్పకుండా తల్లిపాలు పట్టాలన్నారు.
తల్లిపాలు బిడ్డకు ఎంతో శ్రేయష్కరమనే విషయాన్ని అందరూ గ్రహించాలన్నారు. అదే విధంగా అంగన్వాడీ కేంద్రాల అందిస్తున్న పౌష్టికాహారాన్ని గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గర్భిణులు తీసుకునే పౌష్టికాహారంపై శ్రద్ధ చూపడంతో పాటు అంగన్వాడీలో పేర్లను నమోదు చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ ఉపాధ్యాయురాలు మల్లమ్మ, ఏఎన్ఎం భారతీ, సిబ్బంది అండాలు, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు.