చేవెళ్ల రూరల్ : జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ సౌజన్యంతో నేడు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మండల అభివృద్ధి అధికారి హరీశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కౌకుంట్ల గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. ఈ జాబ్ మేళా కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని తెలిపారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాకు కౌకుంట్ల, అంతారం, నవలయపల్లి, తంగడిపల్లి, మడికట్టు, తల్లారం, దుద్దాగు, ఆలూరు గ్రామాలకు చెందిన నిరుద్యోగ యువతి, యువకులు అర్హులన్నారు. అభ్యర్థులు స్టడీకి సంబంధించిన పత్రాలు ఆధార్, నైపుణ్యం సంబంధించిన సర్టీఫికెట్లను తీసుకుని హాజరు కావాల్సిందిగా కోరారు.
సంబంధిత కంపెనీలు (సంస్థల్లో) ఖాళీలు
అమేజాన్ (శంషాబాద్)లో 500, యాక్సిస్ బ్యాంక్ (హైదరాబాద్)లో 100, హెచ్డీఎఫ్సీ (హైదరాబాద్)లో 100, జెన్ప్యాక్ (హైదరాబాద్)లో 50, గూగుల్ (హైదరాబాద్)లో 50, టెలీఫర్మామెన్స్ (హైదరాబాద్)లో 50, రిలయన్స్ ట్రెండ్స్ (సోమాజిగూడ)లో 100 ఉద్యోగాలకు ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. స్థానిక యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.