మొయినాబాద్ : విద్యార్థులు జీవితంలో నిర్ధేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే పట్టుదల, కృషి ఉండాలని టాస్క్ సీఈవో శ్రీకాంత్ సిన్హా అన్నారు. మండల పరిధిలోని కేజీరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలోని విద్యార్థులు వందశాతం ఉపాధి అవకాశాలు (ప్లేస్మెంట్) సాధించడంతో శనివారం విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలంటే తప్పకుండ జీవిత లక్ష్యం అనే బావన కలిగి ఉండాలని పేర్కొన్నారు. లక్ష్యాన్ని చేరుకోవటానికి విద్యార్థులు పట్టుదలతో చదువుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ రోహిత్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జగీర్దార్, అధ్యాపకులు పాల్గొన్నారు.