కొందుర్గు : ప్రతి గ్రామంలో ధార్మిక కార్యక్రమాలు చేపడితే గ్రామాలు శుభిక్షంగ ఉంటాయని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఆదివారం జిల్లెడు దరిగూడ కేంద్రంలోని ఆర్యసమాజ్ భవన్లో నిర్వహించిన 42వ యజుర్వేద పారాయన యజ్ఞం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందదర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్వ కాలంలో యజ్ఞ యాగాలు ఎక్కువ శాతం చేసేవరని అన్నారు. యజ్ఞాలు చేసిన గ్రామాల్లో అందరూ సభిక్షంగ ఉంటారని అన్నారు. వర్షాలు కూడ సకాంలో కురుస్తాయని పేర్కొన్నారు.
యువత చెడు మార్గంలో నడవకుండ సన్మార్గంలో నడువాలని తెలిపారు. నేటి కంప్యూటర్ యుగంలో యువత సాంస్కృతి సాంప్రదాయలను విడనాడి పాచ్ఛత్యా సాంస్కృతికి అలవాటు పడుతున్నారన్నారు. 42 సంవత్సరాలుగా దరిగూడలో యజ్ఞం చేస్తుండడం ఎంతో అభినందనీయమని అన్నారు. ప్రతి గ్రామంలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్లు బాబురావు, వెంకటస్వామి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు హఫీజ్, శ్రీధర్రెడ్డి, దూలయ్య, సుధాకర్రావు, కొనెరు నర్సింగరావు, కోనేరు శ్రీనివాస్ పాల్గొన్నారు.