కందుకూరు:మండల పరిధిలోని దాసర్లపల్లి గ్రామంలో దివంగత జనార్ధనశర్మ వ్యవసాయ క్షేత్రంలో శ్రీ మాత విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో 108 వ చండీ హోమాన్ని చండీ ఉపాసకులు రేవల్లె రాజుశర్మ నిర్వహించారు. అమ్మదయ వల్ల కరోనా మహమ్మారి రాష్ట్రం నుంచి పారిపోవాలని ఆకాంక్షించారు. హోమంతో పాటు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం పుర్ణాహుతి నిర్వహించారు. అనంతరం భక్తులకు ఉచితంగా అన్నదానం చేశారు.
ఈ కార్యక్రమంలోపాల్గొన్న తాసీల్దారు జ్యోతి, సీఐ కృష్ణంరాజులు అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మాట్లాడుతూ, ప్రజలు దైవ కార్యక్రమానికి సమయం కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ పొలెమోని బాలమణి అశోక్ముదిరాజ్, టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం మాజీ అధ్యక్షుడు పొలెమోని అశోక్ ముదిరాజ్, యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్ల కార్తీక్, సోషల్ మీడియా కన్వీనరు బొక్క దీక్షిత్రెడ్డి, ఆర్యవైశ్య సంఘం మండల నాయకులు కుంచకూరి వెంకటేశ్వర్లు గుప్తా, సౌడపు శేఖర్గౌడ్, ప్రవీణ్, వెంకటేష్, యుగేందర్, వివిధ గ్రామాల భక్తులు పాల్గొన్నారు.