కొత్తూరు రూరల్ : ఉమ్మడి ప్రభుత్వ పాలనలో కుల వృత్తిదారులు వివక్షకు గురయ్యారని, టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం కులవృత్తులను ప్రోత్సహించటమే లక్ష్యంగా ముందుకుసాగుతుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మండల కేంద్రంలోని ఎంపీవో కార్యాలయంలో మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు గుండు సురేశ్ముదిరాజ్ ఆధ్వర్యంలో ఆదివారం చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ హాజరై లబ్ధిదారులకు చేపపిల్లలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని, ప్రజల అవసరాలను బట్టి సీఎం కేసీఆర్ పథకాలను తీసుకొచ్చి అమలు చేస్తున్నట్లు తెలిపారు.
గత ప్రభుత్వాలు 70ఏండ్ల పాలనలో ఏ ప్రభుత్వం కూడా కుల వృత్తులను ప్రోత్సహించలేదన్నారు. క్షౌరశాలలకు ఉచిత విద్యుత్ను అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. మత్స్యసహకార సంఘాలకు ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేయటంతో పాటు చేపలను సరఫరా చేసేందుకు టూ, ఫోర్ వీలర్ వాహనాలను సబ్సిడీపై అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని అన్నారు. ముదిరాజ్లు ఆర్థికంగా ఎదిగేందుకే ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాల్లో గల చెరువులు, కుంటల్లో వేసేందుకు 3,93,600 చేపపిల్లలను పంపిణీ చేసినట్లు తెలిపారు. అందులో మూడు రకాలైన రవ్వు, బొచ్చ, బంగారు తీగా చేపలను పంపిణీ చేశామన్నారు.
మత్స్యసహకార సంఘం సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదుగాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గణేశ్ముదిరాజ్, జిల్లా ఫీల్డ్ ఆఫీసర్ యోసుదాస్, మత్స్యశాఖ అధికారులు యాదగిరి, మహేందర్, అంబేద్కర్, ప్రణీత్, గూడూరు, ఇన్ముల్నర్వ సర్పంచ్ సత్తయ్య, అజయ్నాయక్, పీఏసీఎస్ చైర్మన్ అశోక్, వైస్ చైర్మన్ పద్మారావు, ముదిరాజ్ సంఘం మండలాధ్యక్షుడు మాసుల అంజయ్య, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎమ్మె సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీ దేవేందర్యాదవ్, మత్స్య సహకార సంఘం నాయకులు నర్సింలు, రాజు, చంద్రయ్య, నారాయణ, కృష్ణ, గిరిముదిరాజ్, కొత్తూరు మున్సిపాలిటి కౌన్సిలర్లు పాల్గొన్నారు.