హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని మంచాలలో విషాదం చోటుచేసుకున్నది. పెళ్లయిన రెండు వారాలకే నవవధువు ఆత్మహత్య చేసుకున్నది. గౌతమి (21) అనే యువతికి 14 రోజుల క్రితం మంచాలకు చెందిన యువకునితో వివాహం జరిగింది. అప్పటి నుంచి ఆమె అత్తగారింట్లోనే ఉంటున్నది. ఈ క్రమంలో ఆమె ఇవాళ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.