చేవెళ్ల టౌన్ : ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన పోచమ్మ బోనాల ఉత్సవాల్లో ఎమ్మె ల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, టీఆర్ఎస్ యువనాయకుడు పట్లోళ్ల కౌశిక్రెడ్డితో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి కరుణ అందరిపైన ఉండాలని వారు కోరుకున్నట్లు తెలిపారు. అదే విధంగా గ్రామంలో తొట్టేల ఊరేగింపులో పోతురాజుల విన్యాసాలు, డప్పుల సప్పుడు, శివసత్తుల పూనకాలు అందరిని ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, టీఆర్ఎస్ యువనాయకుడు పట్లోళ్ల కౌశిక్రెడ్డిలు పాల్గొన్నారు.