నాగిరెడ్డిపేట్/లింగంపేట/ఎల్లారెడ్డి/పిట్లం/నిజాంసాగర్, ఏప్రిల్ 20 : జిల్లాలో వరి కోతలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు ధాన్యాన్ని అమ్ముకునేందుకు ఇబ్బంది కలుగకుండా రాష్ట్ర ప్రభుత్వం ఊరూరా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయిస్తున్నది. మంగళవారం ఏర్పాటు చేసిన కేంద్రాలను స్థానిక ప్రజాప్రతినిధులు, సొసైటీ పాలకవర్గ సభ్యులు, నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. మద్దతు ధరను కల్పించేందుకు ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నాగిరెడ్డిపేట్ మండలంలోని మాల్తుమ్మెద సొసైటీ పరిధిలోని పోచారం, చీనూర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను చైర్మన్ నర్సింహులు ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచులు విజితారెడ్డి, అనూష, ఎంపీటీసీ వినితారెడ్డి, డైరెక్టర్లు సిద్ధయ్య, శ్రీనివాస్రెడ్డి, యాదయ్య, మాజీ చైర్మన్ రాజారెడ్డి, ఏఈవో బబిత పాల్గొన్నారు.
లింగంపేట మండలంలోని సురాయిపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం సేకరణ కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ దేవేందర్రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ రాజశేఖర్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి భీంరెడ్డి, రైతులు పాల్గొన్నారు.ఎల్లారెడ్డి మండల పరిధిలోని అన్నాసాగర్, లక్ష్మాపూర్ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్నాసాగర్లో వెల్లుట్ల సొసైటీ అధ్యక్షుడు పటేల్ సాయిలు, లక్ష్మాపూర్లో ఎల్లారెడ్డి సొసైటీ అధ్యక్షుడు ఏగుల నర్సింహులు ప్రారంభించారు. సర్పంచులు పెరుగు నాగరాజు, రవీందర్గౌడ్, పీఏసీఎస్ డైరెక్టర్లు బాలరాజ్, మర్రి సూర్యప్రకాశ్, సీఈవో విశ్వనాథం, ఏఈవో రాజాగౌడ్, నాయకుడు జీవన్ పాల్గొన్నారు.
పిట్లం మండలంలోని బొల్లక్పల్లి, రాంపూర్, అన్నారం గ్రామాల్లో చిల్లర్గి-పిట్లం సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం సేకరణ కేంద్రాలను చైర్మన్ శపథంరెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచులు పట్లోళ్ల సావిత్రి, నారాయణరెడ్డి, కాశీరాం, ఎంపీటీసీ హన్మాండ్లు, టీఆర్ఎస్ నాయకులు శ్రీహరి, రవీందర్, కార్యదర్శి సంతోష్రెడ్డి, సొసైటీ డైరెక్టర్లు పాల్గొన్నారు.
నిజాంసాగర్ మండలంలోని కొమలంచ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గున్కుల్ సొసైటీ చైర్మన్ వాజిద్అలీ ప్రారంభించారు. ఆయన వెంట సీడీసీ చైర్మన్ గంగారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సత్యనారాయణ, కో-ఆప్షన్ సభ్యుడు ఇస్మాయిల్, సర్పంచ్ అనురాధ, సొసైటీ వైస్ చైర్మన్ నర్సింహులు ఉన్నారు.