యాచారం : యాచారం మండలం మంతన్గౌరెల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు బిక్కునాయక్ శనివారం టీఆర్ఎస్ యాచారం మండల అధ్యక్షుడు కర్నాటి రమేశ్గౌడ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. నిన్న బీజేపీలో చేరిన బిక్కునాయక్ శుక్రవారం తన సొంత గూటికి చేరడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సపావట్ విజయలక్ష్మీ, యాచారం సహకారసంఘం వైస్ చైర్మన్ యాదయ్యగౌడ్, బ్యాంకు డైరెక్టర్ నరేందర్, నాయకులు మాన్సింగ్, శ్రీనివాస్ నాయక్, రవీందర్, రమేశ్ పాల్గొన్నారు.