షాద్నగర్టౌన్, సెప్టెంబర్ 01: షాద్నగర్ మున్సిపాలిటీలోని వార్డుల్లో ఏర్పాటు చేస్తున్న సీసీరోడ్లతో పట్టణం మరింత సుందరంగా మారుతున్నదని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మున్సిపాలిటీలోని కాలేజీ రోడ్డులో సీసీరోడ్డు పనులను గురువారం మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతున్న మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో సీసీరోడ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రోజు రోజుకు పెరుగుతున్న జనాభాతో షాద్నగర్ మున్సిపాలిటీ నలువైపులా విస్తరించిందని, నూతనంగా ఏర్పడిన కాలనీల్లో సైతం అన్ని మౌలిక వసతులను సమకూరుస్తున్నామన్నారు. సీసీరోడ్ల నిర్మాణంలో నాణ్యతను తప్పకుండా పాటించాలన్నారు. అదే విధంగా ప్రతి ఇంటికీ నీళ్లను అందించే విధంగా మిషన్ భగీరథ పథకం ద్వారా పైపులైన్ పనులు పూర్తయ్యాయని, దీంతో సీసీరోడ్డు పనులకు సజావుగా కొనసాగుతున్నాయన్నారు. పట్టణాభివృద్ధిలో ప్రజ లు భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో మాజీ చైర్మన్ విశ్వం, కౌన్సిలర్ ప్రతాప్రెడ్డి పాల్గొన్నారు.
గణనాధుడికి ఎమ్మెల్యే పూజలు
కేశంపేట : కేశంపేట మండలం చింతకుంటపల్లిలో ఏర్పాటు చేసిన గణేషునికి బుధవారం రాత్రి షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పూజలు చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ విశాల, సర్పంచ్ పార్వతమ్మ, టీఆర్ఎస్ నాయకులు శ్రావణ్రెడ్డి, జంగయ్య, రమేశ్యాదవ్, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.