బషీరాబాద్ : సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత సర్పంచ్లదేనని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని నీళ్లపల్లి గ్రామంలో పర్యంటించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. పిచ్చి మొక్కల నివారణకు మందును పిచికారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి సాధించాలంటే గ్రామస్తుల భాగాస్వామ్యం చాలా ముఖ్యమన్నారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే గ్రామ ప్రజలు అరోగ్యాంగా ఉంటారన్నారు. ప్రతి ఒక్కరూ పారిశుధ్యాన్ని పాటించాలని పేర్కొన్నారు.
పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో 80శాతము పారిశుధ్యం మెరుగు పడిందన్నారు. ప్రభుత్వం పంచాయతీకి ఓ ట్రాక్టర్ను కెటాయించి గ్రామాల్లో పారిశుధ్యం లేకుండా చేసిందన్నారు. గతంలో గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం కనిపించేదని గుర్తు చేశారు. పల్లె ప్రగతి కార్యక్రమంతో పారిశుధ్యం విషయంలో గ్రామస్తుల్లో చైతన్యం వచ్చిందన్నారు. నీళ్లపల్లి గ్రామ పర్యటన ముగించుకుని జలాల్పూర్ గ్రామానికి వెళ్లి ఇటివల మృతి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త కుర్వ గోవింద్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మండల కేంద్రానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ అమర్ప్రసాద్ మృతిచెందగా ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి వారి కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్నాయక్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పంజుగుల శ్రీశైల్రెడ్డి, రాజారత్నం, నర్సిరెడ్డి, గోపాల్ అడ్వకేట్, రామునాయక్, రజాక్, మునిందర్రెడ్డి, రంగారెడ్డి, నరేష్చవాన్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.