షాబాద్ : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని షాబాద్ సీఐ ఆశోక్ అన్నారు. శనివారం షాబాద్ మండల పరిధిలోని రేగడిదోస్వాడ గ్రామంలో సైబరాబాద్ పోలీసు జాగృతి కళాబృందం ఆధ్వర్యంలో సైబర్నేరాలు, మూఢనమ్మకాలపై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని చెప్పారు. సైబర్నేరాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫీక్ నిబంధనలు పాటించాలన్నారు.
ద్వీచక్ర వాహనదారుడు హెల్మెంట్ ధరించాలని, కారు నడిపే వారు సీటు బెల్ట్ పెట్టుకోవాలన్నారు. నేరాల అదుపునకు ప్రధాన చౌరస్తాల వద్ద సీసీ కెమోరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఒక్క సీసీ కెమోరా వందమంది పోలీసులతో సమానంగా పని చేస్తుందన్నారు. బాల్య వివాహాలు, మూఢనమ్మకాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ ఆధ్వర్యంలో గ్రామాల్లో ప్రజలకు కళాజాత బృందం ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాములు, ఎంపీటీసీ పార్వతమ్మ, కళాబృందం ఇన్చార్జి నాగరాజు, ఉప సర్పంచ్ శ్రీనివాస్, గ్రామస్తులు శేఖర్, జంగయ్య, రాంచంద్రయ్య, మల్లారెడ్డి, వెంకట్రెడ్డి పాల్గొన్నారు.