తలకొండపల్లి : మండల పరిధిలోని అంతారంలో ప్రజలకు మూఢనమ్మకాలు, సైబర్క్రైంపై సైబరాబాద్ పోలీస్ జాగృతి కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ శివశంకర్వరప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఎక్కడ చూసిన ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని ప్రజలందరూ ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మూఢ నమ్మకాల పేరుతో గ్రామాల్లో ప్రజలు సమయాన్ని వృథా చేసుకుంటూ మోసపోతున్నారని తెలిపారు.
గ్రామాల్లో కొత్త వ్యక్తులు ఎవరైనా అనుమానంగా తిరుగుతున్నా, ఎలాంటి ఆపద ఉన్నా 100కి ఫోన్ చేస్తే సకాలంలో పోలీసులు వస్తారని తెలిపారు. కళాజాత బృదం నాటిక రూపంలో మూఢనమ్మకాలు, ఆన్లైన్మోసాలు, ఫోన్లో అపరిచిత వ్యక్తుల పరిచయాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ తిరుపతి, గంగాధర్రెడ్డి, నాగరాజు, ప్రమిళ, జైపాల్, మహేందర్, రాజు, శ్రీనివాస్, వెంకటేశ్, సుదర్శన్, శ్రీశైలం, నరహరి, మహేశ్ పాల్గొన్నారు.