తలకొండపల్లి : తలకొండపల్లి మండల కేంద్రంలో గల యూనియన్ బ్యాంకు ఎటీఎంలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగుడు చోరీ చేసేందుకు యత్నించాడు. అర్థరాత్రి ఎటీఎంను పగలగొట్టి డబ్బులు తీసుకునే ప్రయత్నం చేయగా ఎటీఎం మిషన్ ధ్వంసం అయ్యింది.
ఉదయం విషయాన్ని గమనించిన పలువురు ఖాతాదారులు బ్యాంక్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న యూనియన్ బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ గణేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసునమోదు చేసుకున్న పోలీసులు ఎటీఎం వద్ద క్లూస్టీంతో పరిశీలించారు.