తలకొండపల్లి : తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో ఎస్ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్ అడ్మిషన్లు పొందేందుకు నోటిపికేషన్ విడుదల అయినట్లు తలకొండపల్లి టీఓఎస్ఎస్ కో ఆర్డినేటర్ ప్రధానోపాద్యాయులు భగవాన్రెడ్డి, విష్ణుమూర్తి తెలిపారు. 2020-21 సంవత్సరానికి గాను 14 సంవత్సరాల వయస్సు నిండిన వారు నవంబర్ 10వరకు ఎలాంటి విద్యార్హత లేకుండా నేరుగా పదో తరగతి అడ్మిషన్ తీసుకోవచ్చునని అన్నారు. అదే విధంగా పదో తరగతి ఉత్తీర్ణత సాదించిన వారు ఇంటర్మీడియట్లో అడ్మిషన్ పొందవచ్చునని తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 9441477877, 7013551740 నంబర్లలను సంప్రదించాలని సూచించారు.