షాబాద్ : రంగారెడ్డిజిల్లా కలెక్టరేట్ వద్ద మంగళవారం టీఎన్జీవో జిల్లా ఉద్యోగులందరూ కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హుజురాబాద్ సభలో దళితబంధు ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు సైతం దళితబంధును ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించడం సంతోషకరమన్నారు. అందుకు సీఎంకు సంఘం తరుపున కృతజ్ఞతలు తెలిపారు. రాబోవు రోజుల్లో ప్రభుత్వం ఏ సంక్షేమ కార్యక్రమం తలపెట్టిన ప్రభుత్వ ఉద్యోగులుగా తమ కర్తవ్యాన్ని నిర్వహించి ప్రభుత్వానికి అండగా ఉంటామని తీర్మానం చేశారు. కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మణ్, బుచ్చిరెడ్డి, కోశాధికారి విజయ్కుమార్, సంజయ్నాయక్, చంద్రశేఖర్, నరసింహ, రాజేశ్వర్రెడ్డి పాల్గొన్నారు.