మొయినాబాద్ : పురుటి నొప్పులతో బాధపడుతున్న నిండు గర్బిణిని ఆసుపత్రికి తరలిస్తుండగా అంబులెన్స్లోనే బిడ్డకు జన్మనిచ్చింది. మండల పరిధిలోని సజ్జన్పల్లి గ్రామానికి చెందిన మహేశ్వరి నిండు గర్బిణి. గురువారం పురుటి నొప్పులు రావడంతో మొయినాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చింది.
అయితే ఇక్కడి నుంచి 108లో నగరంలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి తరలిస్తుండగా హిమాయత్నగర్ వద్దకు వెళ్లగానే నొప్పులు ఎక్కువ కావడంతో 108 సిబ్బంది ఆమెకు పురుడు పోశారు. పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది. తిరిగి మొయినాబాద్ పీహెచ్సీకి తీసుకొచ్చారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్య సిబ్బంది తెలిపారు.