నందిగామ : రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరు గ్రామంలో సర్పంచ్ సంతోష ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించేందుకు గురువారం సీఎస్ సోమేశ్కుమార్ రానున్న నేపథ్యంతో బుధవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్కుమార్, అడిషనల్ కలెక్టర్ ప్రతీక్జైన్లు చేగూరులోని బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు. సీఎస్ సోమేశ్ కుమార్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పచ్చదనం పెంచాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి మండలంలో సుమారు 5 నుంచి 10 ఎకరాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనంను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచాలని సూచించారు. కార్యక్రమంలో డీపీవో శ్రీనివాస్రెడ్డి, షాద్నగర్ ఆర్డీవో రాజేశ్వరి, ఎంపీడీవో బాల్రెడ్డి, ఎంపీవో గిరిరాజ్, డీఆర్డీవో నీరజ, చేగూరు పీఏసీఎస్ మాజీ చైర్మన్ విఠల్, గ్రామస్తులు పాల్గొన్నారు.