ఆమనగల్లు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకొని వ్యాపారం చేయాలని డీఆర్డీఏ అడిషనల్ డైరెక్టర్ జంగారెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆమనగల్లు మండల మహిళా సమైఖ్య కార్యాలయం ఆవరణలో ఏపీఎం కృష్ణయ్య ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఆమనగల్లు, మాడ్గుల, కడ్తాల, తలకొండపల్లి మండలాలకు చెందిన మహిళా సంఘాల సభ్యులు, ఏపీఎంలు, సీసీలు హాజరయ్యారు. సమావేశంలో ఆయా మండలల్లో ఉన్న 901 గ్రూపు మహిళా సంఘాల సభ్యులకు నూతన వ్యాపారాల కోసం వ్యాపార ప్రణాళికలు రూపొందించి సమావేశంలో తీర్మానం చేశారు.
అనంతరం 762 గ్రూపు మహిళలకు వ్యాపారాల కోసం బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, కమ్యూనిటీ, ఇన్వెస్ట్ ఫౌండు ద్వారా రుణాలు ఇప్పించి గ్రౌండింగ్ చేశారు. వ్యాపారం కోసం రుణాలు తీసుకున్న మహిళ గ్రూపు సభ్యులంతా 12 శాతం వడ్డీతో 12నెలల్లో రుణాలను చెల్లించాలని సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణ మహిళలు ఆర్థికంగా బలోపేతం చేసే ఉద్దేశంతో ప్రభుత్వం వారికి అన్ని రకాలుగా ఆర్థిక సహాయ సకారాలను అందిస్తుందని అవకాశాలను మహిళలంతా అందిపుచ్చుకోవాలన్నారు. గ్రామాల్లో వ్యాపార నైపుణ్యాలను పెంచుకొని ఉన్నతంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఏపీఎం నర్సింహ, మండల సమైఖ్య అధ్యక్షురాలు నిర్మల, ఏపీఎంలు వెంకట్రెడ్డి, రాజేశ్వరి, కో-ఆర్డినేటర్లు శైలజ పాల్గొన్నారు.