ఆమనగల్లు : ఆమనగల్లు, మాడ్గుల మండలానికి చెందిన పలువురు బాధితులకు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్ వేరువేరుగా సీఎం రిలీఫ్ చెక్కులను మంగళవారం పంపిణీ చేశారు. మాడ్గుల మండలం దొడ్లపహాడ్కు చెందిన జయమ్మకు రూ. 31 వేలు, నాగిళ్లకు చెందిన బుచ్చమ్మకు రూ. 21 వేలు, వెల్దండ మండలంలోని బొల్లంపల్లికి చెందిన రాజుకి రూ. 28వేల చెక్కులను పంపిణీ చేశారు. ఆమనగల్లు మున్సిపాలిటీకి చెందిన అచ్చయ్యకు రూ. 60వేల చెక్కును ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అందజేశారు.