కడ్తాల్ : సమాజంలో ప్రతి ఒక్కరూ భక్తిభావాన్ని పెంపొందించుకుని సన్మార్గంలో నడువాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల కేంద్రంతో పాటు మైసిగండి గ్రామంలో దేవిశరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. గురువారం కడ్తాల్ మైసిగండిలోని అమ్మవారు మహిషాసుర మర్ధినిదేవీగా భక్తులకు దర్శనమిచ్చారు. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి మైసమ్మతల్లిని, దుర్గాదేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ నిత్యం భగవంతుడిని స్మరించడంతో ప్రతి ఒక్కరి జీవనం సుఖసంతోషాలతో వర్ధిల్లుతుందని తెలిపారు. అనంతరం ఆలయ నిర్వాహకులు అమ్మవారి తీర్థప్రసాదాలను వారికి అందజేసి, ఎమ్మెల్సీతో పాటు ప్రజాప్రతినిధులు పూలమాలలు, శాలువాలతో సన్మానించారు.
మండల కేంద్రంలోని దుర్గాదేవిని జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో ఆచారి పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ ట్రస్టీ శిరోలీ, ఈవో స్నేహలత, నాయకులు సురేందర్రెడ్డి, భాస్కర్రెడ్డి, హన్మానాయక్, వేణుగోపాల్, బిక్కునాయక్, చందోజీ, శేఖర్గౌడ్, నరేశ్నాయక్, ఆలయ అర్చక సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.