ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ పటిష్టత కోసం ప్రతి నాయకుడు, కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ జెండా పండుగ సందర్భంగా గురువారం పార్టీ సీనియర్ నాయకులు క్యామ మల్లేశ్తో కలిసి ఆయన ఇబ్రహీంపట్నం చెరువు కట్టపై పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీలో పనిచేసే కార్యకర్తలకు తప్పకుండా తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కృపేశ్, యాచారం జడ్పీటీసీ జంగమ్మ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్ మండలాలతో పాటు ఇబ్రహీంపట్నం, తుర్కయంజాల్, పెద్దఅంబర్పేట్, ఆదిబట్ల మున్సిపాలిటీల్లో జెండాలను ఎగురవేశారు.
టీఆర్ఎస్ పటిష్టతకు ప్రాధాన్యం
కొత్తూరు : గ్రామాల వారీగా టీఆర్ఎస్ పటిష్టతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. కొత్తూరు సౌత్ ఇండియా బ్యాంకు వద్ద టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు యాదగిరి జెండా ఎగుర వేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామం, మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ జెండా ఎగురవేశామన్నారు.
పల్లె పల్లెన గులాబీ జెండా
షాద్నగర్ : పల్లె పల్లెన గులాబీ జెండా ఎగిరింది. జై తెలంగాణ నినాదాలతో మార్మోగింది. పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ నాయకులు ర్యాలీలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ దేశ రాజదాని ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణ పనుల ప్రారంభం నేపథ్యంలో గురువారం ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఆధ్వర్యంలో షాద్నగర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ జెండాలను ఎగురవేశారు. పట్టణం, వెల్జర్ల గ్రామంలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ గులాబీ జెండా ఎగురవేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.