తుర్కయాంజాల్ : దళిత కౌన్సిలర్ పట్ల అనుచితంగా మాట్లాడిన కమిషనర్పై చర్యలు తీసుకోవాలని ఉమర్ఖాన్గూడ కౌన్సిలర్ కరాడి శ్రీలతఅనిల్ కుమార్ శనివారం కేంద్ర జాతీయ కమిషనర్ షెడ్యూల్డ్ కులాల వైస్ చైర్మన్ అరుణ్ హల్దార్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అరుణ్ హల్దర్ మాట్లాడుతూ కౌన్సిలర్కు జరిగిన అన్యాయం పట్ల ఎస్సీ, ఎస్టీ కమిషన్ తరపున తక్షణమే విచారణ జరిపి శాఖపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సంఘటనకు బాధ్యులైన కమిషనర్ పై సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశానని తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర జాతీయ షెడ్యూల్డ్ కులాల మాజీ డైరెక్టర్ రాములు, బీజేపీ రాష్ట్ర దళిత మోర్చా అధ్యక్షుడు కొప్పు బాషా, యువ మోర్చా రంగారెడ్డి జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు యాదవ్, నాయకులు పుట్టల శ్రీకాంత్, గొట్టె శ్రీకాంత్, మనోహర్ రెడ్డి, లక్ష్మణ్, మల్లారెడ్డి, బాల్రెడ్డి పాల్గొన్నారు.