కొడంగల్, డిసెంబర్ 16: పేదల పెన్నిధిగా వెలుగొందుతున్న స్థానిక శ్రీమహాలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం నుంచి ధనుర్మాస పూజలు ప్రారంభమవుతాయని ఆలయ అర్చకులు, ధర్మకర్తలు తెలిపారు. భక్తులు కొడంగల్ వేంకటేశ్వరుడిని రెండోతిరుపతిగా కొలు స్తుంటా రు. తిరుమల తిరుపతి ఆలయంలో జరిగిన విధంగానే ఇక్కడి ఆలయంలోనూ నిత్యపూజలు కొనసాగుతాయి. అదేవిధంగా ధనుర్మాస పూజలనూ తిరుమల మాదిరిగా నిర్వహించడం ఇక్కడి విశిష్టత.
ప్రతిరోజూ ఉదయమే సుప్రభాత సేవతో మొదలుకొని విశేష పూజలు, ప్ర త్యేక అలంకరణలతో శ్రీనివాసాచార్యుల ఆధ్వ ర్యంలో తిరుప్పావై పారాయణం కొనసాగుతుం ది. శుక్రవారం సాయంత్రం 6.12 గంటలకు ధనుర్ సంక్రమణ ఏర్పడటంతో 17వ తేదీ శనివారం నుంచి ధనుర్మాస పూజలు ప్రారంభమై వచ్చే నె ల 14 వరకు కొనసాగుతాయని అర్చకులు తెలిపారు. జనవరి 14న భోగి పండుగ రోజున గోదాదేవి కల్యాణం, సాయంత్రం తిరుచ్చి ఉత్సవ ఊరేగింపు జరుగుతుందన్నారు. 15న సంక్రాంతి పండుగ..ఆ రోజు సాయం త్రం4 గంటలకు శ్రీవారి తిరుచ్చి ఉత్సవం, 16న కనుమ పండుగ రోజు పద్మావతి అమ్మవారి అలంకరణ, పుష్కరిణి ఆవరణలో కనుమ పండుగ ఉత్స వం.. అలంకరణ తిరుమంజన ఉత్సవం వైభవంగా చేపట్టనున్నట్లు తెలిపారు.