ఆమనగల్లు : కరోనాను నివారించేందుకు ఏకైక మార్గం వ్యాక్సిన్ ఒక్కటేనని ప్రజలకు అవగాహన కల్పించి వ్యాక్సినేషన్ మరింత వేగం పెంచాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి వైద్య సిబ్బందికి సూచించారు. శుక్రవారం ఆమనగల్లు ప్రభుత్వ దవాఖానను ఆయన సందర్శించి అక్కడ రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దవాఖానలో మేరుగైన సౌకర్యాల కల్పించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకేళ్తానని అన్నారు. ప్రజలకు సిబ్బంది అందుబాటులో ఉండి సేవలందించాలని కోరారు. పట్టణ ప్రజలతో పాటు మండలాల నుంచి వచ్చే అర్హులైనందరికీ వ్యాక్సిన్లను వేయాలని కోరారు. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. కరోనా లక్షణాలుంటే వెంటనే ప్రభుత్వ దవాఖానలో పరీక్షలు చేయించుకొని చికిత్స పొందాలని కోరారు.