ఆమనగల్లు : ఆమనగల్లు తాసిల్దార్ కార్యాలయంలో బుధవారం ఏసీబీ అధికారుల బృందం తనిఖీలు చేపట్టారు. మహబుబ్నగర్ ఏసీబీ సీఐ లింగస్వామి నేతృత్వంలో నలుగురు అధికారులు ఉదయం కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం డిప్యూటీ తాసీల్దార్ మనోహర్ను కలిసి తమకు కావాల్సిన రెవెన్యూ రికార్డులను తెప్పించుకొని వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తాసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టడంతో విలేకరుల అధికారులను వివరాలు అడుగగా ఉన్నతాధికారుల ఆదేశానుసారం కార్యాలయంలో పలు రికార్డులను పరిశీలినకు వచ్చామని సంబంధిత విషయాలను ఉన్నాతాధికారులు వెల్లడిస్తారని వారు పేర్కొన్నారు.
గత నెల 26నుంచి తాసీల్దార్ చందర్రావు వ్యక్తిగత సెలవుపై వెల్లడంతో ఇన్చార్జి తాసీల్దార్గా మనోహర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో పలువురు పలు రకాలుగా ఏసీబీ అధికారుల తనిఖీలపై చర్చించుకొవడం కొసమెరుపు. గత కొన్నిరోజులుగా తాసీల్దార్ కార్యాలయం ఆవరణలో భూముల క్రయ విక్రయాలకు సంబంధించి పలువురు రైతులు అధికారులు పనితీరు పై ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఏసీబీ అధికారులు అధికారికంగా ప్రకటన చేస్తే తప్పా తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలు వెళ్లడించాల్సి ఉంది.